" T " ~ t     " T " ~ t     " T " ~t     " T " ~ t     " T " ~t     " T " ~ t

Monday 29 September 2014

Jashuva Padya Patana Potee by Yuvatharangalu-ANAKAPALLI

   నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 120వ జయంతిని పురస్కరించుకొని యువతరంగాలు ఆధ్వర్యంలో అనకాపల్లి లోని శ్రీ వివేకానంద ట్రస్ట్ హాల్ లో 28 సెప్టెంబర్ 2014 ఆదివారం , సాయంత్రం జాషువా పద్యాల పోటీ నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ఆంధ్రా బ్యాంక్ వుడ్ పేట్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ యు . విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు . మొదటిగా జాషువా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు . 
    21 సెప్టెంబర్ 2014 గురజాడ జయంతి సందర్భంగా యువతరంగాలు జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో అనకాపల్లి, ఏ ఎం . ఏ . ఎల్ . కళాశాలలకు చెందిన వి . మౌనిక , చందక శ్రీనులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు రాగా ,రావికమతం మండలం మరుపాకలోని ఏ .పి . మోడల్ స్కూల్ విద్యార్థి చిన్ని పురుషోత్తమ నాయుడు కి తృతీయ బహుమతి వచ్చింది . 
     జాషువా పద్యాల పోటీలో మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినీలు ఆర్ . యశోద పద్మ , జి. జయలక్ష్మి . బి హరితలకు వరుసగా ప్రథమ , ద్వితీయ , తృతీయ బహుమతులు వచ్చాయి .రెండు పోటీ లలోని విజేతలకు 316, 216, 116 రూపాయలను నగదు బహుమతిగా, యోగ్యతా పత్రాన్ని , విలువైన గ్రంధాలను , జ్ఞాపికలను ప్రథమ , ద్వితీయ , తృతీయ స్థానం విజేతలకు  ముఖ్య అతిథి యు . విజయానంద్ చేతులమీద అందించడం జరిగింది.  
   ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కథకులు జి . రంగబాబు , ఇవటూరి గౌరీశం , డా . కాండూరి సీతారామ చంద్ర మూర్తి , డా . ఎం . వెంకటేశ్వర రావు వ్యవహరించారు .   














































































No comments:

Post a Comment